ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడిక్కడే !

-

జగిత్యాల జిల్లాలో ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కోరుట్ల మండలం వెంకటాపూర్‌లో ఈ ప్రమాదం జరిగింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు మండల కేంద్రానికి చెందిన వారిగా గుర్తించారు.

మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా చెబుతున్నారు. మల్లాపూర్ ‎కు చెందిన శ్రీనివాస్ తన బావ మరిది చంద్రమోహన్ దుబాయ్ వెళుతుండడంతో ఆయనను హైదరాబాద్ బస్సు ఎక్కించేందుకు జగిత్యాలకు కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. తిరుగు ప్రయాణంలో వెంకటాపూర్ శివారులో ఆగి ఉన్న లారీని వెనక నుండి కారు ఢీ కొట్టింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version