నేను ఫిట్ గానే ఉన్నా.. సెమిస్ ఆడతా – రోహిత్ శర్మ

-

నేను ఫిట్ గానే ఉన్నా.. సెమిస్ ఆడతానని ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించారు. టి20 ప్రపంచ కప్ లో టీమిండియా సెమీఫైనల్స్ లో ఆడనున్న క్రమంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక విషయాలు తెలిపాడు. ‘నేను ఫిట్ గా ఉన్నాను. సెమి ఫైనల్ కు అందుబాటులో ఉంటా. సెమీస్ కోసం పంత్, దినేష్ కార్తీక్ ఇద్దరు ఉంటారు. జట్టు స్కోర్ 10-2,100-2 ఎలాంటి పరిస్థితుల్లోనూ సూర్య కుమార్ యాదవ్ ప్రదర్శన ఒకేలా చూపిస్తాడు’ అని చెప్పుకొచ్చాడు.

కాగా, సూపర్ ఫామ్ లో ఉన్న కింగ్ కోహ్లీ గాయపడినట్లు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా హర్షల్ పటేల్ బౌలింగ్ లో కోహ్లీ గాయపడ్డాడని బీసీసీఐ వర్గాల సమాచారం. అయితే కోహ్లీకి ఎక్కడా గాయమైంది, దాని తీవ్రత ఏంటి, రేపటి మ్యాచ్ కు కోహ్లీ అందుబాటులో ఉంటాడా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news