TDP అంటే తెలుగు దుష్మసనుల పార్టీ – మంత్రి రోజా

-

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎప్పుడూ ప్రతి పక్షాలను చీల్చి చెండాడుతూనే ఉంటుంది. అయితే.. తాజాగా తెలుగు దేశం పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసింది ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా. టిడిపి పార్టీ పూర్తిగా… తెలుగు దుష్మసనుల పార్టీగా మారిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో టిడిపి నేతలే అరాచకాలకు పాల్పడుతున్నారని, వీటిపై నారా లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె ప్రశ్నించారు. మహిళలను వేధించిన వాళ్లకే టిడిపిలో పదవులు ఇస్తారని, రాష్ట్రం నుండి మహిళలే టిడిపిని తరిమి కొట్టాలని అన్నారు. కాగా, ఇటీవల ఏపీలో బాలికలు, మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. దీనితో అధికార వైసిపి ప్రతిపక్ష టీడీపీలు ఒకరిపై ఒకరు పోటీపడి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version