కూటమి ప్రభుత్వానికి చెందిన వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు కూడా పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ జెండా వేసిన.. ముగ్గు పైనుంచి నడుచుకుంటూ వచ్చారు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. దీనిపై వైసీపీ పార్టీ సీరియస్ అవుతోంది.

జాతీయ జెండాను అవమానించిన జీవి ఆంజనేయులుపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు స్పందించారు. దేశ ప్రజలకు క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై మండిపడ్డారు మాజీ మంత్రి రోజా. శత్రువులు కూడా ఇలా చేయరు అంటూ ట్వీట్ చేశారు. ఇదేనా మీ దేశభక్తి చంద్రబాబు, లోకేష్..? అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదేనా మీ దేశభక్తి, @ncbn @naralokesh గారూ?
జాతీయ జెండాపై చెప్పులతో నడిచి అవమానించిన మీ వినుకొండ @JaiTDP ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ @gvanjanneylu! శత్రువులు కూడా ఇలాగ చేయరేమో, కానీ ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధి ఇలా చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు?#IndependenceDay… pic.twitter.com/zS96v7wegg— Roja Selvamani (@RojaSelvamaniRK) August 15, 2025