చంద్రబాబు నాయుడు జన్మ ధన్యమైంది – వైసీపీ ఎంపీ

-

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి జన్మ ధన్యమైందని, మంచి చేస్తే ఒక వ్యక్తిని ప్రజలు ఎంతగా ఆరాధిస్తారో చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన ప్రజలను చూస్తే అర్థమయిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. రాజకీయాలు అనేవి థాంక్స్ లెస్ జాబ్స్ అని అంటారు… కానీ మంచి చేస్తే అదే ప్రజలు బ్రహ్మరథం పడతారని స్పష్టమయ్యిందని అన్నారు.

52 రోజుల పాటు జైల్లో ఉంచి చంద్రబాబు నాయుడు గారి 45 సంవత్సరాల తన ప్రజా జీవితంలో, ప్రజలకు చేసిన మంచిని విస్తృత స్థాయిలో చర్చించుకునే విధంగా చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సిందేనని ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఒకటనుకుంటే మరొకటి జరిగిందని, వామనడు చిన్నవాడే కదా అని మూడు అడుగుల స్థలాన్ని ఇస్తే బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కినట్లుగా… జనాలను బలిచ్చే ఈ అభినవ బలి చక్రవర్తిని ప్రజలు తమ పాదాలతో తొక్కి వేస్తారేమోనని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలిచ్చిన అపూర్వ ఘన స్వాగతాన్ని పరిశీలిస్తే, రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం తద్యమని స్పష్టమైపోయిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news