BREAKING : కూకట్ పల్లిలో రూ. 28.51 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

-

BREAKING : కూకట్ పల్లిలో రూ. 28.51 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంతో పాటు శంఖుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు ,ఇతర నేతలు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో ని ఓల్డ్ బోయినపల్లి వద్ద వార్డు నంబర్ 19 లో రూ.4.48 కోట్ల వ్యయంతో చేపట్టే బోయిన్ చెరువు రిటైనింగ్ వాల్, మనసరోవర్ నాలా టీ జంక్షన్ పనులను మంత్రి కె.టి.ఆర్ శంకుస్థాపన చేస్తారు.

రూ. 555 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే ఆలీ కాంప్లెక్స్ నుండి ఆర్.ఆర్. నగర్ ప్రాగా టూల్స్ బోయిన్ పల్లి వరకు స్టార్మ్ వాటర్ నాలా నిర్మాణానికి శంకుస్థాపన, రూ. 9.80 కోట్ల వ్యయంతో కూకట్ పల్లి లోని రంగదాముని చెరువు (ఐ.డి.ఎల్ లేక్) అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మూసాపేట్ సర్కిల్ వార్డు నెంబర్ 15 లో  సి.ఎస్.ఆర్ కింద రూ. 200 లక్షల వ్యయంతో బాలాజీ నగర్ లో హెచ్ ఐ జి పార్కు  అభివృద్ధి కి శంకుస్థాపన చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version