మణిపూర్ హింసలో కుట్ర కోణాలున్నాయి: RSS చీఫ్ మోహన్ భగవత్

-

ఈ సంవత్సరం మధ్యలో మణిపూర్ రాష్ట్రంలో రెండు తెగల మధ్యన హింసాత్మక ఘటనలు జరిగిన విషయం తెలిసిందే.. ఈ హిమసలో భాగంగా ఒక్కొక్కటిగా బయటకు వచ్చిన వీడియోలు భారతదేశ ప్రజలు సిగ్గుపడేలా చేసింది. ఈ హింసపై RSS చీఫ్ మోహన్ భగవత్ తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన మాట్లాడుతూ మణిపూర్ లో జరిగిన హింస అంతా ఒక కుట్రలో భాగమే అంటూ బాంబ్ పేల్చారు. ఎంతోకాలముగా మణిపూర్ లో మైతేయ్ మరియు కుకీ తెగల ప్రజలు కలిసి జీవిస్తున్నారు, కానీ ఎప్పుడూ ఈ ఘటనలు జరగలేదు అన్నారు మోహన్ భగవత్. దాదాపుగా 9 సంవత్సరాలు చాలా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రము.. ఇప్పుడే ఇలా జరగడం వెనుక ఖచ్చితంగా ఎవరో బయటివారి కుట్ర ఉందని క్లారిటీ ఇచ్చారు భగవత్. ఇలా ఈ రాష్ట్రంలో హింసను పెంచడం వలన బయటివారికి లాభం చేకూరుకుతుంది కాబట్టే ఇలా ప్లాన్ ప్రకారం చేశారన్నారు భగవత్.

అయితే ఎవరు ఈ హింసను ముందుండి నడిపించారు ? దీని వెనుక ఎవరి హస్తం ఉంది ?సరిహద్దు అవతల ఉండే అతీంద్రీయ శక్తులు ఆ కుట్ర చేశాయా ? అంటూ తన ద్రుష్టి కోణాలను బయట పెట్టారు భగవత్.

Read more RELATED
Recommended to you

Latest news