విక్రమ్‌ ధ్రువ నక్షత్రం ట్రైలర్‌.. మామూలుగా లేదు..!

-

విక్రమ్‌ హీరోగా గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ధ్రువ నక్షత్రం’. 2017లోనే చిత్రీకరణ పూర్తైనప్పటికీ.. అనుకోని కారణాలతో ఈ సినిమా వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. నవంబర్‌ 24న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

ముంబై దాడుల సమయంలో ల్యాండ్ కావాల్సిన మొదటి ఎన్ఎస్జి ఛాపర్ కొంచెం ఆలస్యమైంది.. అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో షురూ అయింది. ముఖ్యమైన మిషన్‌ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో హింట్ ఇచ్చేశాడు గౌతమ్‌ మీనన్‌. చాలా రోజుల తర్వాత విక్రమ్‌ స్టైలిష్‌ యాక్టింగ్‌ను చూడబోతున్నట్టు ట్రైలర్‌తో అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యారాజేశ్‌, సిమ్రాన్‌, రాధికా ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ మూవీని ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొండదువోం ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్కేప్‌ ఆర్టిస్ట్స్‌ మోషన్స్ పిక్చర్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి యువ సంగీత దర్శకుడు హరీష్‌ జైరాజ్‌ సంగీతం అందిస్తున్నాడు. ధ్రువ నక్షత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news