ఏపీ ప్రజలకు ఆర్టీసీ బంపరాఫర్..

-

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రజలకు శుభవార్త చెప్పింది. క్యాష్ ప్రైస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆర్టిసి. ఆర్టీసీ కొత్తగా నాన్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సులను తీసుకువస్తోంది. ఈ బస్సు సర్వీసులకు మంచి పేరు చెప్పాలని కోరింది. ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా పేర్లను సూచించాలని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు కోరారు.

ఈ నాన్ ఏసి స్లీపర్ బస్సులలో 30 బెర్తులు ఉంటాయి. తొలిసారి ఏపీలో ఈ బస్సులను తీసుకురాబోతున్నారు. దూర ప్రాంత ప్రయాణికుల కోసం ఆర్టీసీ.. అద్దె ప్రాతిపాదికన నాన్ ఎసి స్లీపర్ కోసం తీసుకువస్తోంది. ప్రయాణికులకు అందుబాటు రేట్లలో ఉండేలా ఈ స్లీపర్ కోచ్ లో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ఫ్యాన్ అలాగే ఓ లైట్ ఉంటుంది. వచ్చే నెలలో ఈ బస్సులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఇరునెల 24వ తేదీలోపు తగిన పేరు సూచించానని… సూచించిన వారికి నగదు రివార్డు ఇస్తామని ప్రకటించింది ఆర్టిసి.

Read more RELATED
Recommended to you

Exit mobile version