మేడారం భక్తులకు శుభవార్త.. ఇవాళ్టి నుంచే బస్సులు ప్రారంభం

-

మేడారం భక్తులకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుండే మేడారానికి ఆర్టీసీ బస్సులు ప్రారంభం కానున్నాయి. నేటి (మంగళవారం) నుండి హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తాజాగా తెలిపారు.

ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుందని ఆయన వెల్లడించారు. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి చార్జీలు పెద్దలు రూ. 125, పిల్లలకు రూ. 65చార్జీగా నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. కరోనా నియమ నిబంధనాలను పాటిస్తూ.. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని.. తెలిపారు. బస్సుల్లో ప్రయాణించే సమయంలో కచ్చితంగా మాస్కులు, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version