RTV రిపోర్టర్‌పై సీఎం రేవంత్ సోదరుడి అనుచరుల దాడి !

-

మహిళా జర్నలిస్టుల మీద మరోసారి అనుముల అనుచరుల దాడి జరిగింది. మీడియాపై దాడి చేశారట తిరుపతి రెడ్డి అనుచరులు. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు FTL పరిధిలో ఉందని కవరేజ్ చేయడానికి వెళ్లిన RTv మీడియా ప్రతినిధులపై దాడి చేశారు తిరుపతి రెడ్డి అనుచరులు. ఇక ఈ సంఘటనపై హరీష్‌ రావు స్పందించారు.

Harish Rao Tweet On RTV Reporter Attack

విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులను అడ్డుకోవడం, మీడియాపై దాడి చేయడం కాంగ్రెస్ పాలనలో నిత్యకృత్యమైందని తెలిపారు. మొన్న సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటన మరువకముందే..నేడు హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటివద్ద మరో మహిళా జర్నలిస్టుకు అవమానం జరిగిందని గుర్తు చేశారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ, మీడియా స్వేచ్చను హరించడం సిగ్గుచేటు అని ఆగ్రహించారు. మీడియా పై జరుగుతున్న వరుస దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news