తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మిన సచిన్‌ టెండూల్కర్.. అక్కడ భూములు మాత్రం..!

-

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల రెవెన్యూ పరిధిలో సచిన్‌ టెండూల్కర్ భార్య అంజలి టెండూల్కర్ పేరిట 6.50 ఎకరాల భూమి ఉంది. 2008 మార్చిలో ఆదిత్య హోమ్స్‌ సంస్థ ద్వారా ఆ భూములు కొనుగోలు చేశారు. అదే ఏడాది జూన్‌లో సినీతారలు రమ్యకృష్ణ, నయనతార కూడా అక్కడ చెరో ఎకరం కొన్నారు. ఈ భూములు రావిర్యాల చెరువు ఫుల్‌ ట్యాంకు లెవల్‌(ఎఫ్‌టీఎల్‌) పరిధిలో ఉన్నాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులను మభ్యపెట్టి సదరు స్థిరాస్తి సంస్థ ఎఫ్‌టీఎల్‌లోని భూములను వారికి అంటగట్టింది” అని ఆదిత్య హోమ్స్ సంస్థ డైరెక్టర్ సుధీర్ రెడ్డి ఆరోపించారు.

Sachin
Sachin 

2008 మార్చి నెలకు ముందు కోటారెడ్డి తన స్నేహితుడి ద్వారా సచిన్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించి ఈ భూములు చూపించారు. లేక్‌ వ్యూ వచ్చేలా అభివృద్ధి చేస్తానని నమ్మబలికి విక్రయించారు. వీటిని రైతుల నుంచి ఎకరా కేవలం రూ.5-10 లక్షల చొప్పున కొనుగోలు చేసి, ఎకరా రూ.కోటి చొప్పున విక్రయించారు. సంస్థ ఉద్యోగి బాలకృష్ణ పేరిట విక్రయాలు జరిగాయి’’ అని సుధీర్‌రెడ్డి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news