ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయిన సద్గురు వాసుదేవ్

-

ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు అనుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.మెదడులో బ్లీడింగ్ కావడంతో ఈ నెల 17న ఢిల్లీలో ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేశారు.

సర్జరీ అనంతరం కోలుకున్న సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇవాళ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.ప్రాణాపాయ స్థితి నుండి అధ్యాత్మిక గురువు బయటపడ్డారని సద్గురు కు ఆపరేషన్ చేసిన వైద్యులు తెలిపారు. కాగా, గత కొద్ది రోజులుగా సద్గురు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలో చేరారు. వైద్యులు టెస్టులు చేయగా.. ఆయనకు మెదడులో భారీ రక్తస్రావం, వాపు ఉన్నట్లు గుర్తించారు.ఈశా ఫౌండేషన్ స్థాపించి పర్యావరణ పరిరక్షణ కోసం సేవ్ సాయిల్, ర్యాలీ ఫర్ రివర్స్ వంటి కార్యక్రమాలను సద్గురు వాసుదేవ్ చేపట్టారు .

Read more RELATED
Recommended to you

Latest news