రామోజీరావుపై సజ్జల రామకృష్ణ రెడ్డి ఫైర్ …

-

ఏపీలో ఉత్తరాంధ్రలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. త్వరలోనే స్టీల్ ప్లాంట్ తెలంగాణకు సొంతం కానుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకుడు మరియు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణ రెడ్డి ఈ వార్తలను ఖండించారు. అంతే కాకుండా ఇటువంటి వార్తలను రాసి స్ప్రెడ్ చేస్తున్న ఈనాడు రామోజీరావు పై తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. ప్రజలు ఎవ్వరూ రామోజీరావు రాసే విషపు రాతలను నమ్మకండి అన్నారు.

ఈ మధ్యన సీఐడీ మార్గదర్శి కేసులో A1 గా ఉన్న రామోజీరావును విచారణ చేయడానికి వెళ్తే.. అనారోగ్యాన్ని కారణంగా చూపి మంచంపై పడుకుని డ్రామా ఆడారు అంటూ రెచ్చిపోయారు. సంస్థలను అమ్మడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అంటూ గతంలో కొన్ని సంస్థలను ప్రయివేటీకరణ చేశాడు అంటూ బాబుపై ఫైర్ అయ్యారు సజ్జల.

Read more RELATED
Recommended to you

Exit mobile version