జనాన్ని ముంచే రియాల్టర్‌గా చంద్రబాబు మారాడు : సజ్జల

-

చంద్రబాబును మించిన 420 మరొకరు ఉండరని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మంగళవారం.. నగరంలోని పంజా సెంటర్లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, అమరావతి పేరుతో వేల ఎకరాలు జేబులో పెట్టుకున్నారని, ప్రజలను ముంచే చంద్రబాబు రియల్టర్ గా మారాడంటూ దుయ్యబట్టారు.

అధికారంలో ఉండగా ఏమీ చేయనందుకు తాను తాను తిట్టుకోవాల్సిన చంద్రబాబు.. ఇప్పుడు జగన్‌ను తిడుతున్నారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాల పేరుతో ఏపీని జగన్ అప్పులపాలు చేస్తున్నాడని, రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మారుస్తాడని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడేమో జగన్ రూ.1 రూపాయి ఇస్తే, తాను రూ.100 ఇస్తానని హామీ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో విజయవాడ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version