హైదరాబాద్ టు నల్గొండ…ఆర్టీసి బస్సులో సజ్జన్నార్ ప్రయాణం…!

-

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ తన మార్క్ ను చూపిస్తున్నారు. తరచూ బస్టాండులలో తనిఖీచేయడం.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం లాంటివి చేస్తూ సజ్జనార్ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా రీసెంట్ గా బస్సులో గుట్కాలు నమిలి ఉమ్మడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక తాజాగా సజ్జనార్ హైదరాబాద్ నుండి నల్గొండ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నల్గొండ బస్టాండ్ లో ఉన్న అసౌకర్యాలను ఆయన పరిశీలించారు.

Sajjanar traveling in bus

అనంతరం మొక్కలు నాటారు. ఆర్టీసీ సేవలపై ప్రయాణికుల రివ్యూ తీసుకోవడంతోపాటు ఆర్టీసీ కార్గో సేవలను సైతం ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో భేటీ అయి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఇక ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని ఏళ్లుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఇప్పుడు సజ్జనార్ మార్క్ తో లాభాల్లోకి వెళుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news