శాకుంతలం ఓటీటీ రిలీజ్.. ఎప్పుడంటే..?

-

సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. సమంత కెరీర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకి నిర్మాతగా నీలిమ గుణ వ్యవహరించింది. దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాని తెరకెక్కించారు. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం లోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యా కథాంశం  పై తెరకెక్కించారు డైరెక్టర్ గుణశేఖర్.
ఇదంతా ఇలా ఉంటే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో శకుంతలగా సమంత , దుష్యంతుడిగా దేవ్ మోహన్  అలరించారు. భరతుడి పాత్రలో అల్లు అర్హ కూడా నటించింది. కీలకమైన పాత్రలో మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ళ నటించారు .. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. విదేశాలలో ఓపెనింగ్స్ పరంగా బాగానే వచ్చినా తెలుగులో మాత్రం కాస్త నెగటివ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది.  తాజాగా ఈ సినిమా ఓటీటి విడుదలకు సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.
శకుంతల సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది . భారీ మొత్తానికి ఈ సినిమా అమెజాన్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.  ఈ చిత్రం  విడుదలైన నాలుగు వారాల తర్వాత మే ఫస్ట్ వీక్ లో ఓటీటి లో స్ట్రిమింగ్ కాబోతున్నట్లు సమాచారం. మరి ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి ఉండాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news