MAHESH BABU : ‘సర్కారు వారి పాట’ లేటెస్ట్ పోస్టర్ రిలీజ్..

-

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశు రామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట పేరుతో సినిమా తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాపై రకరకాల ప్రచారాలు ముందు నుండీ జరుగుతూనే ఉన్నాయి.ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి.  మహేష్ బాబు దుబాయ్ వెళ్లడంతో షూటింగ్ దుబాయ్ లోనే జరుగుతుందని అందరూ భావిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా మరో అప్డేట్ వచ్చింది. 31 న ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందని పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టిన రోజు ఉండటంతో.. అంతకన్నా ముందే.. ఫాన్స్ లో ఉత్సాహం నింపేందుకే ఈ తాజా పోస్టర్ను రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ తాజా పోస్టర్ ఓ బ్యాగ్ పట్టుకొని మహేష్ నడుచుకుంటూ వెళుతున్నాడు.  ఏదో ఫైట్ సీన్ ఉన్నట్లు ఆ పోస్టర్ ను చూస్తుంటే..మనకు అనిపిస్తుంది. కాగా ఈ పోస్టర్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news