శశిథరూర్ జెనీవా వెళ్లేందుకు అనుమతిచ్చిన ఢిల్లీ కోర్టు

-

తన భార్య సునంద పుష్కర్ హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ కి జెనివా వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు సోమవారం అనుమతి జారీచేసింది. ఇటీవల మరణించిన  ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ కోఫి అన్నన్ కు మెంటార్ గా పదేళ్లు శశిథరూర్ వ్యవహరించడంతో ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేయడంతో పాటు కేరళ కోసం అంతర్జాతీయ విరాళాల సేకరణ కోసం జెనీవా  వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరుపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో విదేశీ ప్రయాణానికి అనుమతిస్తూ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ తీర్పునిచ్చారు. ప్రయాణానికి సంబంధించిన విషయాలను దర్యాప్తు అధికారికి తెలియజేయాలని జడ్జి ఆదేశించడంతో సోమవారం సాయంత్రం విదేశాలకు వెళ్లి, మంగళవారం భారత్ కు తిరిగివస్తారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news