బక్రీద్ బుధవారమే

-

 

రుహియతే హిలాల్ కమిటీ నిర్ధారణ

ఈద్-ఉల్-జుహ (బక్రీద్) పండుగను 22వ తేదేనే జరుపుకోవాలని రుహియతఏ హిలాల్ (నెలవంక నిర్ధారణ) కమిటీ సోమవారం సాయంత్రం ప్రకటించింది. ఇస్లామియా క్యాలెండర్ని అనుసరించి ప్రతీ ఏటా జిల్ హజ్ నెలలో నెలవంక కనిపించిన పదో రోజు ఈ పండుగ జరుపుకుంటామని దీంతో ఈ నెల 22న బక్రీద్ నిర్వహించాలని కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్ పాషా ఖుత్తారీ పేర్కొన్నారు. గతేడాది నవంబర్ 24న జారీ చేసిన ఉత్తర్వుల్లో  ఆగస్టు 22వ తేదీని సాధారణ సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news