విజయవాడలో మరో దారుణం జరిగింది. విజయవాడలోని శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ కిడ్నాప్ జరిగింది. ఇప్పుడు ఈ సంఘటన విజయవాడ నగరంలో కలకలం రేపుతోంది. శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ జరగడం వివాదంగా మారింది. బందర్ రోడ్డు లోని డి అడ్రస్ మాల్ వద్ద వంకాయలపాటి శ్రీనివాసులు కిడ్నాప్ చేశారు దుండగులు.

అయితే దీనికి సంబంధించిన సిసి ఫుటేజ్ బయటకు వచ్చింది. కిడ్నాప్ అయిన విషయం తెలియగానే వెంటనే పోలీసులను ఆశ్రయించారు వంకాయలపాటి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై లోతుగా విచారణ చేస్తున్నారు.
- విజయవాడలో శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ కిడ్నాప్ కలకలం
- శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్
- బందర్ రోడ్డులోని D అడ్రస్ మాల్ వద్ద వంకాయలపాటి శ్రీనివాస్ను కిడ్నాప్ చేసిన దుండగులు
- పోలీసులను ఆశ్రయించిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు