ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా… ఖలేజా సినిమా రీరిలీజ్ సందర్భంగా కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక సెంటర్ లో మహేష్ బాబు ఫ్లెక్సీలతో పాటు వైసీపీ జెండాలతో హల్చల్ చేశారు యువకులు. దింతో జై బాబు, జై జగన్ అంటూ నినాదాలు చేసారు.

ఇది ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ తో వీరాభిమాని అరగుండు గీయించుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా ఉనగట్ల కు సంబంధించిన వీరవల్లి శివరామకృష్ణ అలియాస్ శివ… అనే వ్యక్తి 2024లో వైసీపీ అధికారంలోకి రాకపోతే తాను అరగుండు గీయించుకుంటానని… చాలెంజ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుల ముందు ఛాలెంజ్ ఓడిపోయిన శివ… జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న అభిమానంతో గుండు గీయించుకున్నట్లు తెలిపాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఖలేజా సినిమా రీరిలీజ్ సందర్భంగా కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక సెంటర్ లో మహేష్ బాబు ఫ్లెక్సీలతో పాటు వైసీపీ జెండాలతో హల్చల్ చేసిన యువకులు
జై బాబు, జై జగన్ అంటూ నినాదాలు #KhalejaReRelease #YSJagan #MaheshBabu pic.twitter.com/8fF5Zb7AGQ
— BIG TV Breaking News (@bigtvtelugu) May 31, 2025