డిగ్రీ అర్హతతో స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం.. అప్ప్లై చేయండిలా

-

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున నియామకాలు చేపట్టింది. ఏకంగా 8500 అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి ఇటీవల నోటిఫికేష‌న్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల కాల‌ప‌రిమితికి ఈ అప్రెంటిస్ పోస్టుల‌ను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హతతో పాటు ఆసక్తి, అనుభ‌వం ఉన్న అభ్యర్థులు డిసెంబర్‌ 10 వరకు బ్యాంక్ వెబ్‌ సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.   మొత్తం పోస్టులు 8500 కాగా, ఇందులో జ‌న‌ర‌ల్ 3595, ఓబీసీ 1948, ఈడ‌బ్ల్యూఎస్ 844, ఎస్సీ 1388, ఎస్టీ విభాగంలో 725 పోస్టుల చొప్పున ఖాళీలు ఉన్నాయి.

sbi
sbi

ముందుగా రిటెన్ ఎగ్జాం ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన వారికి లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక అప్ప్లై చేసే వారికిస్థానిక భాష‌ మీద ప‌ట్టు ఉండాలి. దేశ‌వ్యాప్తంగా 8500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, అందులో 1100 పోస్టులు తెలుగు రాష్ట్రాలకు కేటాయించగా అందులో తెలంగాణ‌లో 460 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్‌లో 620 ఖాళీలను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. జనరల్ అభ్యర్థులకు ఫీజు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్యర్థుల‌కు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. దరఖాస్తు చేసుకునేందుకు https://www.sbi.co.in/web/careers  కి వెళ్ళండి.

Read more RELATED
Recommended to you

Latest news