BREAKING : రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ సి. నరసింహారావు మృతి

-

రాజకీయ, సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ సి. నరసింహారావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి దాటాక 1.50 గంలకు తుదిశ్వాస విడిచారు. హైదరాబాలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు  తెలిపారు.

వ్యక్తిత్వ వికాసంపై నరసింహారావు అనేక పుస్తకాలు రచించారు.  సి. నరసింహారావు 1948, డిసెంబర్ 28న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. స్వస్థలం క్రిష్ణాజిల్లా పెద్దపాలపర్రు. విజయీభవ, విజయపథం, వ్యక్తిత్వ వికాసం, అన్యోన్య దాంపత్యం, పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడం ఎలా?, బిడియం వద్దు, అద్భుత జ్ఞాపకశక్తి వంటి అనేక పుస్తకాలు రచించారు.

ఇక జర్నలిస్ట్‌ సి. నరసింహారావు మృతి పట్ల సంతాపం తెలిపారు నారాలోకేష్‌. “ప్రముఖ సాహితీవేత్త, రాజకీయ, సామాజిక విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు సి. నరసింహారావు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.” అంటూ నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version