Samantha NagaChaitanya: సామ్ చైతూ విడాకుల్లో మ‌రో ట్విస్ట్! తెర‌పైకి స‌రోగ‌సీ మ్యాట‌ర్!

-

Samantha NagaChaitanya: సినీ ఇండ‌స్ట్రీలో సమంత నాగచైతన్యల విడాకుల ప్రకటన హాట్ ఇష్యూగా చ‌ర్చ‌లో నిలిచింది. గ‌త నెలరోజులుగా వ‌స్తున్న వార్త‌లను నిజం చేస్తూ.. తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు సమంత, నాగ చైతన్య. విడాకుల తర్వాత తమ మధ్య స్నేహబంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉన్న అస‌లు వారు విడిపోవ‌డానికి కార‌ణ‌మేంటి? ఎవ‌రిది త‌ప్పు? స‌మ‌స్య ఎక్క‌డ వ‌చ్చింది వారిద్ద‌రికి అనే ఇంక తెలియ‌డం లేదు. దీంతో ఎవ్వ‌రికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. నరం లేని నాలుక ఎలాగైనా మాట్లాడుతుంద‌న‌ట్టు నెటిజ‌న్లు ఇష్ట‌మెచ్చిన‌ట్టు అభిప్రాయాల‌ను గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది.


తాజాగా ఈ ఇష్యూపై సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు రియాక్ట్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లల్ని కనే విషయంలో సమంత చైతన్యల మధ్య గొడవ జరిగిందని అంటున్నారు. అస‌లు సమంతను అక్కినేని ఫ్యామిలీని వదులుకుని తప్పు చేసిందని అభిప్రాయ పడ్డారు. వారిద్ద‌రి విడాకులు బలవంతంగా జరిగిందని, ఎవరో దీని వెనుక ఉండి ఈ బంధాన్ని ముక్కలు చేసేందుకు కుట్ర పన్ని చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

సమంత చాలా తెలివైనా అమ్మాయే.. కానీ తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం స‌రికాదు. సంసారం అన్న త‌రువాత చిన్న చిన్న అపార్దాలు ఎక్కడైనా వస్తుంటాయి. స‌ర్దుక‌పోవాలి.స‌మంత‌ బంగారం లాంటి సంసారాన్ని కాళ్ళ దన్నుకుంటుంది. ఇప్పటికైనా మించిపోయిందేమి లేదు.. కోర్టు ఏలాగు ఆరు నెల‌ల గడువు ఇస్తుంది. ఆ అవ‌కాశాన్ని స‌రిగా ఉప‌యోగించుకుంటే స‌రిపోతుంది. అక్కినేని కుటుంబానికి సమంత అంటే పంచ ప్రాణమని ఆయన చెప్పుకోచ్చారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న షాకింగ్ కామెంట్స్ చేశారు. అస‌లు సమంతకు పిల్లలను కనడం ఇష్టం లేదని, ఈ క్ర‌మంలోనే సరోగసీకి ట్రై చేశారని చెప్పుకొచ్చారు. నూరేండ్ల కాపురాన్ని ముక్క‌లు చేసుకోవ‌డం స‌రికాదు.
చాలా కుటుంబాలలో అభిప్రాయ భేదాలు వాటిని మ‌న‌మే స‌రిచేసుకోవాలని ఇమంది రామారావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news