హత్రాస్ ఘటన.. పోస్టుమార్టం లో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు..?

-

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ లో ఓ యువతిపై కొంతమంది కామాంధులు దారుణంగా అత్యాచారం చేయడమే కాదు… పాశవికంగా హింసించి… చివరికి హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. అత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆడపిల్లలకు సమాజంలో రక్షణ లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోజురోజుకు ఈ ఘటనలో నిందితులకు ఉరిశిక్ష విధించాలి అంటూ ఆందోళన ఎక్కువవుతోన్నాయి.

అయితే హత్రాస్ ఘటనలో అత్యాచారానికి హత్యకు గురైన బాధితురాలి పోస్టుమార్టం రిపోర్ట్ లో ఎన్నో సంచలన నిజాలు బయటపడ్డాయి. పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైన అంశాలు డాక్టర్లనూ సైతం విస్మయానికి గురి చేసాయి. సామూహికంగా యువతిపై అత్యాచారం చేసి దారుణంగా దాడి చేసారు అంటూ వైద్యులు తెలిపారు. యువతి మెడ ఎముక విరిగిందని.. శరీరంపై బలమైన గాయాలు కూడా ఉన్నట్లు రిపోర్టులో గుర్తించారు . కాగా పోస్టుమార్టం రిపోర్టులు మరింత సంచలనంగా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news