సీరం ఇన్ స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ కన్నుమూత‌

-

సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ డా. సురేష్ జాద‌వ్ మృతి చెందారు. ప్ర‌పంచం లో నే అతి పెద్ద వ్యాక్సిన్ త‌యారీ సంస్థ సీరం ఇన్ స్టిట్యూట్ డా. సురేష్ జాద‌వ్ (71) ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ వ్యవ‌హరిస్తున్నాడు. డా . సురేష్ జాద‌వ్.. క‌రోనా నియంత్ర‌ణ వ్యాక్సిన్ కొవిషీల్డ్ త‌యారీ లో కీల‌క పాత్ర పోషించారు. సీరం ఇన్ స్టిట్యూట్ లో డా సురేష్ జాద‌వ్ 1979 నుంచి ఉంటున్నారు.

ఆయ‌న మృతి త‌మ‌కు తీర ని లోటు అని సీరం ఇన్ స్టిట్యూట్ సీఈవో అద‌ర్ పూనావాలా అన్నారు. భార‌త వ్యాక్సిన్ ప‌రిశ్ర‌మ ఉన్న‌తమైన వ్య‌క్తి ని కోల్పోయింద‌ని అన్నారు. అలాగే బ‌యోకాన్ చైర్ ప‌ర్శ‌న్ కిర‌ణ్ మంజుధార్ షా కూడా డా సురేష్ జాద‌వ్ మృతి సంతాపం ప్ర‌క‌టించారు. బ‌యోట‌క్ ప్ర‌పంచం గొప్ప వ్య‌క్తి ని కోల్పోయింద‌ని అన్నారు. అలాగే డబ్యూ హెచ్ వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథ‌న్ కూడా సురేష్ జాద‌వ్ మృతి కి సంతాపం ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news