మోడీ సర్కార్ కీలక నిర్ణయం.. మరోసారి RBI గవర్నర్‌గా శక్తికాంత్ దాస్ !

-

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తి కాంత దాస్‌ పదవీ కాలాన్ని మోడీ సర్కార్‌ మరో మూడేళ్లు పొడిగించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ గవర్నర్ గా శక్తి కాంత దాస్‌ పున ః నియామకాన్ని కేంద్ర కేబినేట్‌ పునర్నియామక కమిటీ ఆమోదం తెలిపింది. ఇక ఆర్బీఐ గవర్నర్‌ గా శక్తి కాంత్‌ దాస్‌ పదవి కాలం ఈ ఏడాది డిసెంబర్‌ 10 వ తేదీ తో ముగియనుంది.

అయితే.. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తో మరో మూడేళ్‌ల పాటు లేదా కేంద్రం ఇచ్చే తదుపరి ఆదేశాల వరకు ఆయన అదే పదవిలో కొనసాగున్నరన్న మాట. కాగా… గతంలో కేంద్ర మంత్రిత్వ శాఖ లోని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా శక్తి కాంత్‌ దాస్‌ పనిచేశారు. ఈ నేపథ్యం లోనే 2018 సంవత్సరం లో ఆర్బీఐ గవర్నర్‌ గా శక్తి కాంత దాస్‌ గవర్నర్‌ గా బాధ్యతలు చేపట్టారు. ఈ గడువు ఈ ఏడాది డిసెంబర్‌ తో ముగియనున్న నేపథ్యం లో తాజాగా ఆయన పదవీ కాలాన్ని పెంచింది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Latest news