చంద్రబాబును చీపుర్లు, చెప్పులతో కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి – వైసీపీ ఎమ్మెల్యే

-

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని చూసి చంద్రబాబు ఉచ్చ పోసుకుంటున్నారని…చంద్రబాబు ను చీపుర్లు, చెప్పులతో కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ. ఇవాళ పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ..హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్సార్ పుణ్యమేనని..హంద్రీనీవా ప్రాజెక్టు కోసం చంద్రబాబు 9 కోట్లు ఖర్చు చేస్తే… వైఎస్సార్ 6500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పనులు పూర్తి చేశారన్నారు.

Shankar Narayana slams chandrababu

ఉరవకొండ సభలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని..సాగు నీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేసింది టీడీపీ నేతలేనని వెల్లడించారు పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి నీరిచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేనని.. చంద్రబాబు – కరవు కవల పిల్లలు అంటూ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు అధికారంలోకి వేస్తే దుర్భిక్షం వస్తుందన్న నమ్మకం రైతుల్లో ఉందని..రెయిన్ గన్స్ పేరుతో రైతులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు దేనన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news