సీఎం జగన్‌ పై వైఎస్‌ షర్మిల ఫైర్‌.. అందరినీ గాలికి వదిలేశారు !

-

పార్టీ మొద‌టి కార్యవ‌ర్గ స‌మావేశంలో అన్న జ‌గ‌న్ కు వైఎస్ ష‌ర్మిల ప‌రోక్షంగా చుర‌క‌లు అంటించారు. తెలంగాణ‌లో వైఎస్సార్ అభిమానుల‌ను గాలికి వ‌దిలేశారని..ఈ రాష్ట్రంలో ఉన్న వారిని ప‌ట్టించుకున్న పాపాన పోలేదని ష‌ర్మిల‌ విమర్శలు చేశారు.

వైఎస్ కుటుంబం కోసం చాలా చేశా రని.. జేబుల‌ నుంచి డ‌బ్బు ఖ‌ర్చు పెట్టుకున్నారన్నారు. వారి శ్రమ‌ను ధార పోశారని… చాలా మంది అభిమానుల‌కు గుర్తింపు ద‌క్కలేదని తెలిపారు. 12 ఏళ్లుగా వైఎస్సార్ కుటుంబంతోనే అభిమానులు ఉన్నారని..గ‌తాన్ని చూసి భ‌విష్యత్ మీద ఆశ కోల్పోవ‌ద్దని పేర్కొన్నారు. ఇప్పటివ‌ర‌కు ఒక లెక్క… ఇక‌ నుంచి ఒక లెక్క అని పేర్కొన్న షర్మిల మ‌న క‌ష్టం మ‌న‌ది.. మ‌న ఫలితం మ‌న‌దన్నారు. “మ‌న పోరాటం మ‌న‌ది. మ‌న గౌర‌వం మ‌న‌ది. మ‌న కోసం మనం..తెలంగాణ ప్రజ‌ల‌కోసం మ‌నం” అని చెప్పారు షర్మిల. తాను నిల‌బ‌డ‌తా వైఎస్సార్ అభిమానుల‌ను నిల‌బెడ‌తానని… రాజ‌న్న ఆశ‌యాలు మ‌న పార్టితోనే సాధ్యమని వెల్లడించారు వైఎస్‌ ష‌ర్మిల‌

Read more RELATED
Recommended to you

Exit mobile version