ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ ది.. దొంగ యాత్ర – షర్మిల

-

వైఎస్‌ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. KCR పాలనలో బడులు, గుడిల కంటే బార్లు, బెల్టు షాపులే ఎక్కువ అన్నారు. అందుకే మంత్రి దయాకర్ రావు సర్పంచులను బీరు సీసాలు అమ్ముకొని ఆదాయం తెచ్చుకోవాలన్నాడని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి.. దొంగ యాత్ర చేస్తున్నాడు. ఇన్నాళ్లు కాంగ్రెస్, BJP మొద్దునిద్ర వల్లే KCR అక్రమాలు సాగాయని తెలిపారు వైఎస్‌ షర్మిల.


కాళేశ్వరంతో సాగు నీళ్లు రాలేదు. మిషన్ భగీరథతో మంచి నీళ్లు రాలేదు. రూ.లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, KCR కుటుంబం కమీషన్లు దండుకుంది తప్పితే నీళ్లు మాత్రం ఇవ్వలేదు. తెలంగాణ ఖజానాను కొల్లగొట్టి, ప్రజలను ఆగం జేశారు. KCR అక్రమాలపై ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేసింది YSR తెలంగాణ పార్టీ మాత్రమేనన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో వైయస్ఆర్ బిడ్డ వెంట అడుగులు వేసి, మద్దతు తెలిపిన పాలకుర్తి నియోజవర్గ ప్రజలకు ఎల్లావేళలా రుణపడి ఉంటా. ప్రజల కోసమే తన జీవితం అంకితం చేసిన వైయస్ఆర్ గారి స్ఫూర్తితో తెలంగాణ ప్రజలకు సేవ చేస్తానని, మళ్లీ సంక్షేమ పాలన తీసుకొస్తానని మీకు మాటిస్తున్నానని వెల్లడించారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version