వరదలో కొట్టుకుపోయిన హీరో శర్వానంద్ తాత ఇల్లు

-

హీరో శర్వానంద్‌ తాతయ్య ఇల్లు ఏంటి ? వరద నీటిలో కొట్టుకు పోవడం ఏమిటి అనుకుంటున్నారా ? నిజమే. హీరో శర్వానంద్ తాత ఇల్లు వరద నీటిలో కొట్టుకు పోయింది. ఎగువన కురుస్తున్న వరదలకి ఇప్పుడు కృష్ణా నది పొంగి పోర్లుతోన్న సంగతి తెలిసిందే. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతుండడంతో నీటిని కిందకు వదులుతున్నారు.

కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలను ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తం చేయగా వరద ముప్పు ఎక్కువగా ఉంటుందని భావించిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే తాజాగా హీరో శర్వానంద్ తాత ఇల్లు కృష్ణా నది వరద ప్రవాహానికి నీటిలో కొట్టుకుపోయింది. ఆయన మాజీ అణు శాస్త్రవేత్త డాక్టర్ మైనేని హరిప్రసాద్, అవనిగడ్డ మండలంలో ఆయనకు ఇల్లు ఉంది. ఈ ఇంటికి శర్వానంద్ కూడా అప్పుడప్పుడు వస్తుంటారు. కొన్ని రోజులు క్రితం కూడా ఇదే ఇంట్లో గడిపి వెళ్ళారని తెలుస్తోంది. గత సంవత్సరం వచ్చిన వరదలకు శర్వానంద్ ముత్తాత ఇల్లు కూడా పూర్తిగా కృష్ణానదిలో కొట్టుకు పోయినట్టు స్థానికులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version