భర్తను వెతుక్కుంటూ వెళ్ళింది, కూతుర్ని కిడ్నాప్ చేసారు…!

-

యాదాద్రి-భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలో దారుణం జరిగింది. మూడేళ్ళ బాలికను కిడ్నాప్ చేసారు. తల్లికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి బాలికను క్దినాప్ చేసారు. జీవనోపాధి కోసం మహబూబ్ నగర్ జిల్లా దక్కూరు మండలం గార్లపాడుకు చెందిన ఉప్పుతాళ్ల రాజు హైదరబాద్ వెళ్ళాడు. నాలుగు రోజులైనా తిరిగి రాకపోవడంతో వెతుక్కుంటూ మూడేళ్ళ కూతురిని వెంటబెట్టుకుని భార్య మహేశ్వరి హైదరాబాద్ వెళ్ళింది.

హైదరాబాద్ ఎంజీబీఎస్ లో ఉన్న ఆమె భర్త దగ్గరకు తీసుకెళ్తామని మాయ మాటలు చెప్పి భువనగిరికి తీసుకొచ్చింది కిడ్నాప్ ముఠా. ఆ తర్వాత కాసేపటికి కూతుర్ని కిడ్నాప్ చేసి ఆమెను వదిలేసారు. పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీ టీవీ ఫూటేజ్ ని పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version