రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో బాల్య వివాహాలను ఆపిన షీ టీమ్…!

-

హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో వేర్వేరు చోట్ల రెండు బాల్య వివాహాలను షీ బృందాలు అడ్డుకున్నాయి. జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలోని బాలాజీనగర్‌లో ఉండే ఓ 17 ఏళ్ల బాలికకు స్థానిక యువకుడి(21)కి ఆగస్టు 5న యాదగిరిగుట్టలో పెళ్లి చేయడానికి నిశ్చయించారు. కుషాయిగూడ డివిజన్‌ షీ బృందం, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాలల సహాయ కేంద్రం అధికారుల సహకారంతో ఇరు కుటుంబాల పెద్దల వద్దకు వెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పెళ్లి రద్దు చేశారు.

child-marriage

మరో ఘటనలో కుషాయిగుడ ఠాణా పరిధిలోని నాగారంలో 16 ఏళ్ల బాలికకు తల్లిదండ్రులు లేరు. మేనత్త, మేనమామల వద్ద ఉంటోంది. జవహర్‌నగర్‌లో ఉండే యువకుడి(26)కి ఆ బాలికను ఇచ్చి స్థానిక పెద్దమ్మ గుడి వద్ద పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. షీ బృందం వారి పెద్దలకు కౌన్సెలింగ్‌ ఇచ్చింది. పెళ్లిని రద్దు చేయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version