రైల్వే ప్ర‌యాణీకుల‌కు షాక్..రిజ‌ర్వేష‌న్ సేవ‌లు తాత్కాలికంగా నిలిపివేత‌..!

-

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే షాక్ ఇచ్చింది. రైల్వే రిజర్వేషన్ సేవలను ఈనెల‌ 21 నుండి పలు సమయాల్లో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టంలో డిజాస్టర్ రికవరీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని తెలిపింది. దానికోసం చార్టింగ్, కరెంట్ బుకింగ్, పీఆర్ఎస్ ఎంక్వయిరీ, టికెట్ రద్దు, చార్జీలు వాప‌స్ పొంద‌డం లాంటి పీఆర్ఎస్ కార్య‌క‌లాపాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

దానికోసం ఈ నెల 21వ తేదీ రాత్రి 11:45 గంట‌ల‌ నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు…. అదే విధంగా తిరిగి 22వ తేదీ 11 45 గంట‌ల‌ నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు సేవలు నిలిచిపోతాయి. ఈ స‌మ‌యంలో ప్రారంభం అయ్యే అన్ని రైళ్ల మెయిన్ చార్టులు…క‌రెంట్ బుకింగ్ చార్టులు ముందుగానే సిద్ధం చేయ‌నున్నారు. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో టికెట్ బుక్ చేసుకునే ప్ర‌యాణికులు ముందుగానే టికెట్ లు బుక్ చేసుకోవ‌డం బెట‌ర్.

Read more RELATED
Recommended to you

Latest news