తృణమూల్ కాంగ్రెస్ కి షాక్‌.. ఎంపీ సభ్యత్వానికి మిమీ చక్రవర్తి రాజీనామా

-

లోక్ సభ ఎన్నికల ముందు వెస్ట్ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది.తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత మిమీ చక్రవర్తి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు TMC చీఫ్ మమతా బెనర్జీకి లేఖ అందించారు. తన నియోజకవర్గంలో పార్టీ నాయకత్వంపై అసంతృప్తే రాజీనామాకు కారణమని తెలిపారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో జాదవ్పుర్ నియోజకవర్గం నుంచి మిమీ ఎంపీగా ఎన్నికయ్యారు.అయితే సీఎం మమత బెనర్జీ ఆమోదించలేదు. ఆమె ఇంకా లోకసభ స్పీకర్కు రాజీనామా లేఖ సమర్పించాల్సి ఉంది.ప్రొటోకాల్‌ ప్రకారం లోక్‌సభ ఎంపీ రాజీనామాను స్పీకర్‌కు అందజేయ్యకపోవడంతో ఇది అధికారిక రాజీనామాగా పరిగణించకపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news