ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్…. ఐపీఎల్ మిగతా మ్యాచులు విదేశాల్లో…?

-

మరికొన్ని రోజులలో దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా 15 రోజుల షెడ్యూల్ ను బీసీసీఐ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.పార్లమెంట్ ఎన్నికలు ఉండటం వలన కేవలం 21 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది. ఈ క్రమంలో ఏప్రిల్, మేలో దశల వారీగా ఎన్నికలు ఉండటంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో ఫేజ్ మ్యాచులను విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ని ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఐపీఎల్ షెడ్యూల్ మొదటి ఫీజ్ను ఇది వరకే ప్రకటించారు.

ఈ నెల 22న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీ పడనున్నాయి.మొదటి దశలో ఏప్రిల్ 7 వరకు మ్యాచులు జరగనున్నాయి. కొద్ది రోజుల్లో రెండో ఫేజ్ షెడ్యూల్ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news