షాకింగ్; వాష్ రూమ్ వాసన భరించలేక చచ్చిపోయాడు!

-

సాధారణంగా టాయిలెట్స్ శుభ్రంగా ఉండకపోతే ఆ వాసన భరించడం అనేది చాలా కష్టం. చాలా మందికి అనారోగ్యం కూడా వస్తుంది. భరించలేని తలనొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒక వ్యక్తి ఏకంగా చచ్చిపోయాడు. అవును అండీ బాబు నిజం… వాష్ రూమ్ వాసన భరించలేక చచ్చిపోయాడు. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఈ దారుణ౦ జరిగింది. దీనితో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో 52 ఏళ్ళ సతీష్ అనే వ్యక్తి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం ఉద్యోగంలో ఉన్న సమయంలో మూత్ర విసర్జనకు గానూ వాష్‌రూమ్‌కు వెళ్లాడు. వెళ్ళిన వ్యక్తి వెళ్ళినట్టే ఉండిపోయాడు. దీనితో అక్కడ ఉన్న వారికి అనుమానం వచ్చింది. అసలు ఎం జరిగిందో అర్ధం కాక వాష్ రూమ్ కి వెళ్ళగా అక్కడ ఏ చలనం లేకుండా సతీష్ పడి ఉన్నాడు.

వెంటనే అక్కడి నుంచి అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్ళగా మరణించాడని వైద్యులు తెలిపారు. వాష్‌రూమ్‌లో మూత్రం నిల్వ ఉండకుండా వాడే రసాయనం నుంచి వచ్చిన వాసన కారణంగా సతీష్ ప్రాణాలు కోల్పోయాడని అతను పని చేసే కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అయితే గ్యాస్ లీకేజీ కారణంగా మరణించాడు అని అతని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news