శ్రద్ధా హత్య కేసు : రంపంతో అమ్మాయి శరీరాన్ని ముక్కలుముక్కలుగా కోశాడు

-

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో దిల్లీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. తాజాగా, శ్రద్ధ వాకర్ హత్య కేసులో మరో నిజం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధాను ముక్కలు చేసేందుకు ఆఫ్తాబ్ రంపం వాడినట్లు ఆటాప్సీ నివేదికలో వెళ్లడైంది.

ఆమె ఎముకలకు నిర్వహించిన టెస్టుల ద్వారా ఈ నిర్ధారణకు వచ్చారు. గత నెలలో మోహరౌలి అడవుల్లో పోలీసులు ఎముకలను గుర్తించారు. డిఎన్ఏ టెస్టులు చేసి అవి శ్రద్ధావే అని తేల్చారు. వాటికి ఢిల్లీ ఎయిమ్స్ లో అటాప్సీ చేయగా, రంపంతో శరీరాన్ని ముక్కలుముక్కలుగా కోసినట్లు తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version