సింగరేణిలో సమ్మె సైరన్ … వచ్చే నెలలో సమ్మెలోకి కార్మికులు

-

సమ్మెకు సింగరేణి కార్మికులు సిద్ధమవుతున్నారు. సింగరేణి వ్యాప్తంగా మరోసారి సమ్మె సైరన్ మోగుతోంది. బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరణతో పాటు.. తమ డిమాండ్లను నిరవేర్చాలంటూ కార్మికులు సమ్మెకు వెళ్లనున్నారు. ఈరోజు మరోసారి యాజమన్యానికి సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు. వచ్చే నెల 9 నుంచి 3 రోజుల పాటు సింగరేణి కార్మికులు సమ్మెకు వెళ్లనున్నారు. ఇందు కోసం సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం( టీబీజీకేెెెఎస్) నోటీసులు మరోసారి ఇవ్వనుంది.

మొత్తం 11 అంశాలపై కార్మికులు సమ్మెకు వెళ్లనున్నారు. నాలుగు బ్లాకులు కళ్యాణిఖని బ్లాక్ 6, కొయ్య గూడెం బ్లాక్ 3,  సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి బ్లాకులను ప్రైవేటికరించడాన్ని కార్మికులు వ్యతిరేఖిస్తున్నారు. కేంద్రం ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. దీంతో పాటు వేతనాల పెంపు, అన్ ఫిట్ కార్మికుల డిపెండెంట్ల వయసును 35 నుంచి 40కి పెంచాలని, కార్మికుల అలియాస్ పేర్లను మార్చాలని, ఏడాది నుంచి మెడికల్ బోర్డును నిర్వహించ లేదని, మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని, అదే విధంగా ఏడాది కాలంగా మెడికల్ బోర్డు లేని కారణంగా డిపెండెంట్ల వయసు పెరిగిందని.. వారికి కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version