ప్రియుడు దూరం పెట్టాడని.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య..!

-

చాలామంది ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక సంఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో ఒక విషాదం చోటుచేసుకుంది. ప్రియుడు చేతిలో మోసపోయానని మనస్థాపము తో యువతి ఆత్మహత్య చేసుకుంది ఈమె ఒక అపార్ట్మెంట్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పని చేస్తోంది. ఫ్లాట్లో ఎవరూ లేని టైం చూసుకుని ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫ్లాట్లో ఉన్న వ్యక్తులు ఎంత సేపు తలుపు కొట్టిన ఆమె స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకి సమాచారాన్ని ఇచ్చారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు అప్పటికే ఆమె ఫ్యాన్ కి వేలాడుతూ కనపడింది. మృతదేహాన్ని కిందకి దించి పరిశీలించారు తర్వాత యువతి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు ఆమె పేరు అతిథి అని తెలిసింది ఆమెను ప్రేమించిన వ్యక్తి కోసం ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news