కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన KTR

-

అసెంబ్లీ ఎన్నికలు ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మళ్లీ టాప్ గేర్ లో దూసుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆదివారం సిరిసిల్ల సర్వ సభ సమావేశాన్ని జరిపారు అయితే ఈ కార్యక్రమానికి కేటీఆర్ కూడా వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ తో కారు కొన్ని రోజులు సర్వీసింగ్ కి వెళ్ళింది తప్ప ఇంకేమీ కాదని చెప్పారు కేటీఆర్. అలానే ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు అలానే అధికారం లోకి రాగానే రైతు ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేస్తామని అన్నారు నేటికీ రైతుబంధు పథకం కింద రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదని అన్నారు. కరీంనగర్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అయినా ఈ సందర్భంగా ప్రకటించారు ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నుండి బరి లోకి దిగుతారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news