తడబడుతున్న టీమిండియా.. ముగ్గురు కీలక ఆటగాళ్లు ఔట్..!

-

ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్ లో భారత జట్టు తడబడుతోంది. 63 పరుగులకే 3 టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయింది. యశస్విజైస్వాల్ 15, గిల్ 0, రోహిత్ 39 రన్స్ కే వెనుదిరిగారు. ఈ మూడు వికెట్లను స్పిన్నర్ టామ్ హార్ట్లీ దక్కించుకున్నారు. విజయం కోసం ఇండియా మరో 136 రన్స్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో కే.ఎల్. రాహుల్, అక్సర్ పటేల్ ఉన్నారు.

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ లో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ త్రుటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 196 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రివర్స్ స్వీప్ ఆడి.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. టీమిండియా 231 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్ ఇంగ్లండ్ 246, భారత్ 436 కి ఆలౌట్ సంగతి తెలిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news