జనసేనతో బీజేపీ కాపురం బాగుంది – సోము వీర్రాజు

-

జనసేనతో బీజేపీ కాపురం బాగుందని చెప్పారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు సోము వీర్రాజు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, జనసేనతో బీజేపీ కాపురం బాగుంది.. జనసేన శ్రేణులు మాకే ఓటు వేస్తాయని వెల్లడించారు.

వారాహి వాహన ప్రారంభోత్సవంలో బీజేపీతోనే ఉన్నట్టు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.. ఉద్యోగ సంఘాలను రాజకీయ పార్టీలుగా చూడొద్దని కోరారు సోము వీర్రాజు. ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆగ్రహించారు. దివాళా తీసిన ప్రైవేట్ ఉద్యోగుల్లా ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తయారైందని మండిపడ్డారు సోము వీర్రాజు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది.. ఉద్యోగులు రోడ్డెక్కి ఉద్యోమాలు చేసే స్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు సోము వీర్రాజు.

Read more RELATED
Recommended to you

Exit mobile version