BREAKING : వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు ఆత్మహత్య

-

BREAKING : వైసీపీ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లెలోని అవంతి అపార్ట్మెంట్లో 101 వ నంబర్‌ ప్లాటులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మంజునాథ రెడ్డి అప్పుడప్పుడూ ఈ ప్లాటుకు వచ్చి, మూడు రోజులు ఉండి వెళుతుంటారు. మూడు రోజుల కిందట ఇక్కడికి వచ్చిన మంజునాథ రెడ్డి… శుక్రవారం శవమై కనిపించారు. మంజునాథ రెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని పప్పిరెడ్డి గారిపల్లె. ఆయన తండ్రి పేరు మహేశ్వరెడ్డి. ఇక మంజునాథ రెడ్డి మరణ వార్త విన్న.. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది. ఇక ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version