రైతు బీమా కోసం కన్నకొడుకు దారుణం… తల్లి మెడకు వైర్ బిగించి..!

-

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కుదావంద్ పూర్ లో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని జులాయి కొడుకు మెడకు వైర్ బిగించి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే..భీమమ్మ (55) ను ఆమె కొడుకు హతమార్చాడు. రైతు బంధు, వితంతు పెన్షన్ కోసం నిత్యం తల్లితో నిందితుడు గొడవ పడే వాడని స్థానికులు చెబుతున్నారు. కాగా నిన్న రాత్రి కూడా పెస్షన్ డబ్బుల కోసం తల్లితో దుర్మార్గుడు గొడవ పడ్డాడు. ఈ క్రమంలో హత్య చేశాడు.

తల్లిని చంపేస్తే రైతు భీమా వస్తుందని భావించి హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. అయితే తానే హత్యచేసి తల్లిని ఎవరో చంపారంటూ మొదట స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ మద్యం సేవించి జులాయి గా తిరుగుతూ నిత్యం తల్లితో గొడవ పడేవాడని స్థానికులు చెప్పడం తో పోలీసులు విచారణ జరిపారు. అసలు విషయం బయటపడటం తో అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news