త్వరలోనే హరీశ్ రావు కొత్త పార్టీ పెడతాడు : రఘునందన్ రావు

-

రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్ లను మీడియాలో రాకుండా చేసి హరీశ్ రావు కొత్త పార్టీ పెడతాడని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.నిజాంపేట మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. హరీశ్ రావు ఆడుతున్న నాటకాలను కేటీఆర్ గమనించడం లేదని అన్నారు. మీడియా, ప్రజల దృష్టి మళ్లించడం కోసం హరీశ్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త నాటకాలు మొదలుపెట్టారని మండిపడ్డారు.

మార్చి 19న ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హరీశ్ రావు విమానంలో చర్చలు జరిపారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చినట్టు చెయ్’ అంటూ ఇద్దరు వాదులాడుకున్నారన్నారు. హరీశ్ రావు మాటలకు తప్ప చేతులకు పనికిరాడని, పది సంవత్సరాల లో లక్ష రూపాయల రుణమాఫీ చేయనందుకు గన్ పార్క్ వద్ద హరీశ్ ముక్కు నేలకు రాయాలని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిన ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై బీజేపీపి ఓడించాలని చూస్తున్నాయని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version