పండుగకు ప్రత్యేక రైళ్లు…

-

సంక్రాంతి పండుగా కారణంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. దీంతో.. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ – సికింద్రాబాద్, నర్సాపూర్ – సికింద్రాబాద్, విజయవాడ – సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.

07001 నంబరు గల సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ స్టేషన్‌ను నుంచి జనవరి 13, 20 తేదీల్లో ఉదయం 9.45 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 7.30 గంటలకు కాకినాడ టౌన్కి చేరుకోనుంది.

82715 నంబరు గల కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ సువిధ స్పెషల్ ట్రైన్ కాకినాడ టౌన్ నుంచి జనవరి 16న రాత్రి 8.50 గంటలకు బయలుదేరుతుంది. తరవాత రోజు ఉదయం 6.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

నర్సాపూర్ – సికింద్రాబాద్ సువిధ స్పెషల్ ట్రైన్ (82713) జనవరి 18, 19 తేదీల్లో నర్సాపూర్‌లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతుంది. తరవాత రోజు ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇదే రైలు జనవరి 20న రాత్రి 10.05 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి తరవాత రోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

 కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ సువిధ స్పెషల్ ట్రైన్ (82710) జనవరి 16, 17, 18 తేదీల్లో రాత్రి 9.50 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరుతుంది. తరవాత రోజు ఉదయం 7.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే, కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ సువిధ స్పెషల్ ట్రైన్ (82715) జనవరి 17, 20 తేదీల్లో కాకినాడ టౌన్ నుంచి రాత్రి 9.20 గంటలకు బయలుదేరుతుంది.

కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ సువిధ స్పెషల్ ట్రైన్ (82726) జనవరి 20న రాత్రి 11.15 గంటలకు కాకినాడ టౌన్‌ నుంచి బయలుదేరుతుంది. ఆ తరవాత రోజు ఉదయం 9.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news