ముఖంపై ఉమ్మి, రాడ్లతో కొట్టి చివరికి.. మహారాష్ట్రలో దారుణ ఘటన.. ?

-

పంచభూతాలకు లేని కులం మనుషులకు ఎందుకో అర్ధం కాదు.. కులం అనేది బ్రతకడానికి పుట్టిన పదమే గానీ బ్రతును కాలరాసేందుకు తీసుకున్న లైసెన్స్ కాదు.. కానీ కొందరు కులం పేరిట దారుణాలకు తెగబడుతున్నారు.. తినే తిండిని, కట్టుకునే బట్ట ఏ కులంవాడి చేతినుండి వచ్చాయో అని చూడని జనం ప్రేమిస్తే మాత్రం కులం కావాలి.. ఈ కుల గజ్జి పట్టిన వారు కొందరు కూడు పెట్టని కులం కోసం ప్రాణాలు తీస్తున్నారు.. మేధావులెందరో కులమతం లేదని చెప్పిన మాటలను మట్టిలో పూడ్చుతున్నారు..

ఇకపోతే ఉన్నత వర్గానికి చెందిన యువతిని ప్రేమించిన పాపానికి ఓ దళిత యువకుడి ప్రాణాలు తీసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఆ వివరాలు చూస్తే.. పుణెకు చెందిన విరాజ్‌ విలాస్‌ జాగ్తాప్‌(20) అనే యువకుడు ఉన్నత కులానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడట.. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబసభ్యులు యువకుడికి ఫోన్‌ చేసి మాట్లాడాలని పిలిపించగా, అమ్మాయి ఇంటికి వెళ్లిన యువకుడిని కులం పేరుతో దూషించడమే కాకుండా, అసభ్యకరమైన పదజాలంతో అతన్ని అవమానించారు. ఇంతటితో ఊరుకోకుండా ఆ యువకున్ని కింద పడవేసి కనికరం లేకుండా రాళ్లు, రాడ్లతో తీవ్రంగా దాడి చేశారట..

 

ఇక యువతి తండ్రి అతని ముఖంపై ఉమ్మి వేస్తూ తీవ్రంగా దూషించాడట.. వీరి దాడికి అతను తీవ్రంగా గాయపడగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.. ఇక రక్తపు మడుగులో ఉన్న ఆ ప్రేమికున్ని స్దానికులు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు ఆ యువకుడు మరణించాడట. కాగా జరిగిన ఈ దారుణం పై ఆ యువకుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు..

Read more RELATED
Recommended to you

Latest news