టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

-

వన్డే ప్రపంచ కప్ లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు భారత స్టార్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు. భారత ఇన్నింగ్స్ ని రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్ ప్రారంభించనున్నారు. ముగ్గురు స్పిన్నర్లతో రోహిత్ సేన బరిలోకి దిగనుంది.

భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కే.ఎల్.రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, కామేరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్ వెల్, మిచెల్ స్టార్క్, హేజిల్ వుడ్, ఆడమ్ జంపా తుది జట్టులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version